ఇంటర్నెట్ యూజర్లను హ్యాకర్లు ఎలా బోల్తా కొట్టిస్తారో తెలుసా

Technology
Technology

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ప్రతి ఒక్కరూ ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి రాత్రి నిద్ర పోయేంత వరకు ఇంటర్నెట్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈరోజుల్లో ప్రతి ఒక్కటి ఆన్‌లైనులోనే గుండుసూది నుంచి గుమ్మడికాయ దాకా అందుబాటులో ఉంటుంది. ఆన్ లైన్ షాపింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఏవేవో ఫేక్ కాల్స్‌ లేదా మెసెజెస్ లతో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని కొందరు కేటుగాళ్లు మన అకౌంట్లో డబ్బులు కొట్టేస్తున్నారు .ఆన్ లైన్లో అమాయకులను టార్గెట్ చేసుకుని ఎన్నో మోసాలు చేస్తున్నారు. అందుకే ఇలాంటి మోసాలు చేసే కేటుగాళ్లు నుంచి వీలైనంత మేరకు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ సందర్భంగా హ్యాకర్లు ఇంటర్నెట్లో నెట్వర్క్ సెక్యూరిటీ, కంప్యూటర్ సిస్టమ్ ని హ్యాక్ చేసి ఇంటర్నెట్ యూజర్లను వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోసం చేసేందుకు హ్యాకర్లు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…

మోసపూరిత లింక్స్..

సాధారణంగా హ్యాకర్లు అమాయక ప్రజలను మోసం చేయడానికి కొన్ని హానికరమైన లింక్స్‌ను మెసెజ్ రూపంలో లేదా వాట్సాప్‌లో పంపుతారు. వాటిపై మనం క్లిక్ చేస్తే చాలు.. అప్పుడు ఆటోమేటిక్‌గా డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. అంతే మీ పర్సనల్ డేటాను అక్కడి నుంచి కొట్టేస్తారు.

ఈ-మెయిల్స్ బెదిరింపులు..

ఇతర పేర్లతో మీకు ఈ-మెయిల్స్ పంపి, మీ పేరుతో మీకు తెలిసిన వాళ్లకు మెయిల్స్ పంపి వారిని మోసం చేస్తారు. దీంతో మీరు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ-మెయిల్ పాస్‌వర్డులను ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. ఏ సిస్టమ్‌ లేదా మొబైల్ లో మెయిల్ ఓపెన్ చేసినా, మీ పని పూర్తయ్యాక కచ్చితంగా సైన్ అవుట్ లేదా లాగవుట్ చేయాలి. లేదంటే మీ మెయిల్‌ను వాడి ఇతరులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడొచ్చు.

tech22ఇ-మెయిల్ అటాచ్‌మెంట్..

ఇ-మెయిల్స్‌లో కొన్ని లింక్స్ లేదా ఫైల్స్‌‌ను అటాచ్ చేసి, కొన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. వారు ఈ లింక్స్, ఫైల్స్‌ను ఓపెన్ చేసిన వెంటనే మీ డేటా మొత్తం చోరీకి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ప్రమాదకరమైన లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.మీకు ఏమైనా అనుమానం వస్తే,సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

ప్రముఖ బ్రాండ్ పేర్లను వాడటం..

యూజర్లను మోసం చేసేందుకు హ్యాకర్లు ప్రముఖ బ్రాండ్ పేర్లతో మోసపూరిత మెసెజెస్‌ను లేదా లోగోలను పంపుతారు. కొంత మంది అట్రాక్టివ్ మెసెజెస్ పంపుతారు. ఇలాంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

లాగిన్ సమాచారం..

హ్యాకర్లు సాధారణంగా ఇంటర్నెట్ యూజర్ల లాగిన్ సమాచారాన్ని అడ్డదారుల్లో పొందేందుకు ప్రయత్నిస్తారు. మీ దగ్గర్నుంచి సమాచారాన్ని రాబడట్టడానికి ఫేక్ కాల్స్ చేసి మాట్లాడతారు లేదా పోలీసులమని చెప్పి ఇతర పేర్లను చెప్పి బెదిరిస్తారు, మీరు భయపడి మీ లాగిన్ క్రెడెన్షియల్స్ వారికి ఇచ్చిన క్షణాల్లోనే, మీ అకౌంట్‌ను హ్యాక్ చేసేస్తారు. ఇలాంటి ప్రయత్నాలు ఇప్పటికీ పలుచోట్ల నిరంతరాయంగా జరుగుతున్నాయి.

చూశారు కదా యూజర్లను మోసం చేసేందుకు హ్యాకర్లు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తారో.. కాబట్టి మీరు ఇంటర్నెట్ వాడకంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి.మీ పర్సనల్ డేటాను ఎవ్వరికీ ఇవ్వకండి.బ్యాంకు నుంచి చేస్తున్నామని, పోలీసులమని ఎవరైనా ఫోన్ చేస్తే అస్సలు నమ్మకండి. మీ సిస్టమ్‌లో బలమైన యాంటీ వైరస్‌ని ఇన్‌స్టాల్ చేయండి. ఏ విధమైన మోసపూరిత వెబ్‌లో పడకుండా జాగ్రత్త వహించాలి.