పడగ విప్పిన ఫాక్ష్యన్ : టీడీపీ మాజీ ఎంపీ మనవడి దారుణ హత్య

doctor pocha prabhakar reddy son srikanth reddy was murdered

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గత కొన్నేళ్ళుగా ఫ్యాక్షన్ మరచి ప్రశాంతంగా ఉన్న కర్నూలు జిల్లా ఈరోజు జరిగిన ఫ్యాక్షన్ హత్యతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జిల్లాలోని డోన్ పట్టణంలో జరిగిన హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రముఖ వైద్యుడు మద్దూరి సుబ్బారెడ్డి మనవడు, తెదేపా నేత పోచ ప్రభాకర్‌ రెడ్డి కుమారుడు శ్రీకాంత్‌ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ రెడ్డిని గత రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తమ వారికి వైద్యం చేయాలంటూ ఆటోలో ఎక్కించుకెళ్లారు. ఈ విషయం తెలియని కుటుంబ సభ్యులు, రాత్రి పొద్దు పోయినా శ్రీకాంత్‌ రెడ్డి ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులతో అతను కనిపించిట్లు చెబుతున్నారు.

అయితే శుక్రవారం ఉదయం ఉడుములపాడు సమీపంలోని గురుకుల పాఠశాల వద్ద ఓ గుర్తు తెలియని మృతదేహం ఉంటండంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి మృతుడు వైద్యుడు శ్రీకాంత్‌ రెడ్డిగా గుర్తించారు. ఎవరు, ఎందుకు చంపారనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అతను శుక్రవారం ఉదయం శవమైన కనిపించాడు. తలపై తీవ్రమైన గాయాలున్నాయి. ఈ హత్యకు కారణమేమిటి, ఎవరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు అనే విషయాలను రాబట్టడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు మారణాయుధాలు వాడకుండా, రాళ్లతో కొట్టి చంపినట్టు తెలుస్తోందని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని వెల్లడించారు. అయితే మృతుడికి శత్రువులు, విరోధులు ఎవరూ లేరని కుటుంబ సభ్యులు తెలిపినా పాత కక్ష్యల నేపధ్యంలోనే ఈ హత్య జరిగినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.