Election Updates: ఇవాళ్టి నుంచే జగన్ ‘మేమంతా సిద్ధం’ యాత్ర..

Election Updates: YS Jagan's public meeting in Vinukonda today
Election Updates: YS Jagan's public meeting in Vinukonda today

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. మే 13వ తేదీన ఏపీలో ఈ రెండు ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో యాత్ర ప్రారంభించనున్నారు. నేటి నుండి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభిస్తారు.

మొదట ఇడుపులపాయలో ప్రార్థనలు చేసిన అనంతరం యాత్ర ప్రారంభం కానుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ ప్రజలతో మమేకం కానున్నారు. దాదాపు 21 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. వైజాగ్, బాపట్ల, ఏలూరు, అనంతపురం నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాలలో సీఎం జగన్ యాత్ర కొనసాగిస్తారు. ఎందుకంటే ఆ జిల్లాలలో ఇప్పటికే సిద్ధం సభలు నిర్వహించారు. అందుకే మిగతా జిల్లాలను కవర్ చేయనున్నారు.