Election Updates: ఈరోజు ప్రొద్దుటూరులో జగన్ భారీ బహిరంగ సభ

Election Updates: Today and tomorrow, Jagan will go on a bus trip to the joint Kurnool district
Election Updates: Today and tomorrow, Jagan will go on a bus trip to the joint Kurnool district

ప్రొద్దుటూరు భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. మే 13వ తేదీన ఏపీలో ఈ రెండు ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో యాత్ర ప్రారంభించనున్నారు.

మొదట ఇడుపులపాయలో ప్రార్థనలు చేసిన అనంతరం యాత్ర ప్రారంభం కానుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ ప్రజలతో మమేకం కానున్నారు. దాదాపు 21 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. అనంతపురం, వైజాగ్, బాపట్ల, ఏలూరు నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాలలో సీఎం జగన్మోహన్ రెడ్డి యాత్ర కొనసాగిస్తారు. ఎందుకంటే ఆ జిల్లాలలో ఇప్పటికే సిద్ధం సభలు నిర్వహించారు. అందుకే మిగతా జిల్లాలను సీఎం జగన్ కవర్ చేయనున్నారు.