Election Updates: ఏపీ రాజకీయ నాయకుల కోసం హెల్మెట్లు.. ఫోటోలు వైరల్

Election Updates: Helmets for AP politicians.. Photos go viral
Election Updates: Helmets for AP politicians.. Photos go viral

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైయస్ జగన్ పై రాళ్లతో దాడులు చేశారు కొంతమంది దుర్మార్గులు. విజయవాడలో ప్రచారం చేస్తున్న సమయంలో రాళ్లతో జగన్మోహన్ రెడ్డి పై దాడి చేశారు. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి కంటికి తీవ్రమైన గాయం అయింది. అయితే జగన్ తో పాటు వెల్లంపల్లి శ్రీనివాస్ కు కూడా గాయమైంది.

అటు నిన్న పవన్ కళ్యాణ్ పై కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టారు. ఈ తరుణంలో ఏపీ రాజకీయ నాయకులు ప్రచారంలో పాల్గొనేటప్పుడు హెల్మెట్లు వాడాలని సూచనలు చేస్తున్నారు సోషల్ మీడియా వారియర్స్. హెల్మెట్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి.. ప్రచార సమయంలో హెల్మెట్స్ వాడండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.