ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్ షాక్ తగిలింది.అంధ్రప్రదేశ్ సీఐడీ చంద్రబాబుపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అసైన్డ్ భూముల కుంభకోణంలో చంద్రబాబుపై ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు సోమవారం వెల్లడించింది.
అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంలో ఛార్జ్ షీటు దాఖలు చేయగా.. రూ.4400 కోట్ల భూముల స్కామ్ జరిగినట్లు సీఐడీ నిర్ధారించింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా చంద్రబాబును చేర్చిన సీఐడీ.. మాజీ మంత్రి నారాయణను ముద్దాయిగా పేర్కొంది. మొత్తం 1100 ఎకరాల అసైన్డ్ భూముల స్కామ్ జరిగినట్లు సీఐడీ తెలిపింది. రికార్డులను ట్యాంపరింగ్ చేసి అసైన్డ్ భూములు కాజేసినట్లు తేల్చింది.