Election Updates: ఆ మూడు సీట్లే కీలకం.. సీఎం జగన్ ఫుల్ ఫోకస్..!

Election Updates: Good news for AP farmers today.. 11.59 lakh people benefited
Election Updates: Good news for AP farmers today.. 11.59 lakh people benefited

వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుల్ని ఓడించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అయితే కుప్పంలో చంద్రబాబు నాయుడుని, మంగళగిరిలో నారా లోకేష్ ని, పవన్ కళ్యాణ్ ని ఓడించాలని జగన్ చూస్తున్నట్లు తెలుస్తోంది. రిపోర్ట్ ప్రకారం ఈ సీట్ల మీద జగన్ చాలా సీరియస్ గా ఉన్నారు. కుప్పంలో భారీ బహిరంగ సభకి హాజరైన జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు మీద విరుచుకుపడ్డారు. సంక్షేమ పథకాలను చూసి కుప్పంలో చంద్రబాబుని ఓడించాలని అన్నారు. జగన్ ఇప్పటిదాకా మంగళగిరిలో ముగ్గురి ఇన్చార్జిలని మార్చారు.

లోకేష్ ని ఓడించడానికి జగన్ నిరంతరం వివిధ సర్వే నివేదికలను తీసుకుని మంగళగిరి అభ్యర్థుల్ని మారుస్తున్నారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ భీమవరం లేదా పిఠాపురంలో పోటీ చేయడం ఖాయం జగన్ కూడా పవన్ నియోజకవర్గంలో దీనివనైనా పోటీ చేస్తే ఓడించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు చేస్తున్నారు. పవన్ పై పోరాడడానికి జగన్ ఇప్పటికే గోదావరి జిల్లాల నుండి కాపు నేతలని లాగడం మొదలుపెట్టారు.