Election Updates: ఇవాళ టీడీపీలోకి వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యే

Election Updates: YCP MPs, MLAs join TDP today

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఏప్రిల్ మాసంలో పార్లమెంటు ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంతోపాటు అభ్యర్థులను ఫైనల్ చేసుకుంటున్నాయి. ఇక మరి కొంతమంది టికెట్టు రాకపోవడంతో పార్టీలు కూడా మారుతున్నారు.

ఇందులో భాగంగానే ఇవాళ టిడిపి పార్టీలో ఇద్దరు వైసీపీ ఎంపీలు అలాగే ఒక ఎమ్మెల్యే చేరనున్నారు. సార్వత్రిక ఎన్నికల మీద నాయకుల పార్టీల మార్పులు ఊపు అందుకున్నాయి. ఇందులో భాగంగానే ఇవాళ ముగ్గురు పార్టీని వీడుతున్నారు. మైల వరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హైదరాబాద్ లో టిడిపి చీఫ్ చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారు. నెల్లూరులో జరిగే టిడిపి సభలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేరుతారు. అలాగే పలనాడులో జరిగే సభలో శ్రీకృష్ణదేవరాయలు టిడిపి కండువా వేసుకోనున్నారు.