సూపర్ స్టార్ ఆరోగ్యం పై మరోసారి పుకార్లు

Rajinikanth and Akshay Kumar

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్నా చిత్రం 2.ఓ మరో నాలుగు రోజుల్లో విడుదలకు సిద్ధం అవ్వుతుంది. ఇలాంటి తరుణం ల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో చేరాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఆరోగ్యం కాస్త విషమంగా ఉన్నది అనే వార్త తెలియడంతో రజినీకాంత్ ఫాన్స్ షాక్ గురయ్యారు. పెద్ద సంఖ్యలో ఫాన్స్ రజిని ఇంటికి చేరుకున్నారు. మరికొందరు దేవాలయం లో పూజలు అర్చనలు చేయించారు. ఇవన్ని పుకార్లే ఎవరో పుట్టించారు అని తెలవడం తో రజిని ఫాన్స్ ఉపిరి పీల్చుకున్నారు.

rajinikanth linga movie

తాజాగా లత రజినీకాంత్ అద్వర్యంలో నిర్వహించబడే ఓ కార్యక్రమంకు రజినీకాంత్ విచ్చేసాడు. అప్పుడు రజినీకాంత్ ఎంతో ఆరోగ్యంగా మునపటికన్నా నూతన ఉత్షాహం తో కనిపించారు. ఏలాంటి అనారోగ్యం లేని రజినీకాంత్ కి ఇలాంటి పుకార్లు పుట్టించి రజినీ ఫాన్స్ ని ఎందుకు కంగారు పెట్టడం అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు లింగ చిత్రం రిలీజ్ సమయం లో కూడా రజిని ఆరోగ్యం పైన ఇలాంటి వార్తలే వచ్చాయి. అప్పుడు వచ్చిన వార్తలు కూడా పుకార్లే, ఎవరో రజిని అంటే గిట్టని వారు చేస్తున్నారు అని ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వార్తలు ఇకనైనా ఆపాలని మీడియాను హెత్సరిస్తునారు. ప్రస్తుతం రజిని పెట్టా సినిమా షూటింగ్ పనులతో చాలా బిజీగా ఉన్నారు ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి పొంగల్ కి విడుదల కానున్నది.