కాకినాడ పవర్ ప్లాంట్ వద్ద అగ్ని ప్రమాదం

కాకినాడ పవర్ ప్లాంట్ వద్ద అగ్ని ప్రమాదం

జిల్లాలోని కాకినాడ పట్టణంలో ఉన్న జీఎంఆర్ పవర్ ప్లాంట్ వద్ద శనివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద స్థలంలో భారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి… దట్టమైన పొగ వ్యాపిస్తుంది.

అయితే ఈ పవర్‌ ప్లాంట్‌ కొన్నేళ్లుగా పని చేయడం లేదు. దీంతో ప్లాంట్‌లో ఎవరూ లేరు. ప్రమాదం విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.