విమానంలో మంటలు….శంషాబాద్ లో 150 మందికి…!

Fire broke on flight while landing in hyderabad

హైదరాబాద్, శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్టులో 149 మంది ప్రయాణీకులతో ఉన్న విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున కువైట్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన జజీరా J9608 విమానంలో అగ్ని ప్రమాదం సంభవించింది. విమానం రన్‌ వేపై ల్యాండ్ అవుతుండగా కుడివైపు ఇంజిన్‌ నుంచి భారీగా మంటలు చెలరేగాయి. గాల్లోనే మంటలను గమనించిన పైలట్, విషయాన్ని విమానాశ్రయ అధికారులకు చేరవేయగా, వారు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అనుమతి ఇచ్చారు. పైలట్‌ విమానాన్ని వెంటనే నిలిపేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పేశారు. ప్రయాణికులు సురక్షితంగానే ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.