ఇక జనరల్ టికెట్లు కూడా ఫోన్ నుండే !

General Ticket Of Train Online Booking Indian Railways

ఓ పక్క రైలు బయల్దేరేందుకు సిద్ధంగా ఉంటుంది మరోపక్క నిల్చున్న టికెట్‌ కౌంటర్‌ వద్ద పెద్ద క్యూ… టికెట్‌ దొరుకుతుందా లేదా రైలు ఎక్కుతామా? లేదా అని టెన్షన్ పడే సందర్భం రైలులో ప్రయాణించే ప్రతి ఒక్కరికే ఒక్క సారి అయినా ఎదురయ్యే ఉంటుంది. ఇక ఇప్పుడు ఆ టెన్షన్ ఇక ఉండదు ఎందుకంటే దీనికి ఫులుస్టాప్ పెట్టేసింది దక్షిణ మధ్య రైల్వే. రిజర్వేషన్‌ లేని సాధారణ (జనరల్‌) టికెట్లను మొబైల్‌ఫోన్‌ నుంచి బుక్ చేసుకొనే సదుపాయాన్ని దక్షిణ మధ్య రైల్వే అందించనుంది. మరో ఒకట్రెండు రోజుల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నది. ఇందుకోసం ‘యూటీఎస్‌ ఆన్‌ మొబైల్‌’ పేరుతో ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే ఈ యాప్ ప్లేయ్ స్టోర్ లో పెట్టినా కొన్ని రైల్వేజోన్లు ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చాయి.

మరికొన్ని రైల్వేజోన్లలో కాస్త ఆలస్యం అయ్యింది. అందులో దక్షణ మధ్య రైల్వే కూడా ఒకటి. అయితే ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తే క్యూ లైన్ లో నిలబడే సమస్య తీరనుంది. దక్షిణ మధ్యరైల్వే జోన్‌ పరిధిలో అన్ని రైల్వేస్టేషన్లలో యూటీఎస్‌ ఆన్‌ మొబైల్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ యాప్‌తో ఎక్కడినుంచైనా, ఎన్ని రోజుల ముందైనా జనరల్ టికెట్‌ను పొందవచ్చు. జనరల్‌ టికెట్‌ తీసుకోవాలంటే ముందుగా పేరు, చిరునామా, ఫోన్‌ నెంబరు వంటి వివరాలతో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ‘రైల్వే వాలెట్‌’లో కొంత డబ్బును జమ చేయాల్సి ఉంటుంది. టికెట్‌ తీసుకొనేటప్పుడు ఈ వాలెట్‌ నుంచి డబ్బులు టికెట్‌కు వెళతాయి. ఏదైనా కారణంతో ప్రయాణం రద్దైతే టికెట్‌నూ రద్దు చేసుకోవచ్చట.