ప్రేమ ముదిరింది: ఈ లాక్ డౌన్ వేళ.. లవర్ ని కలిసేందుకు అనుమతివ్వండి.. !

ప్రపంచమంతా కరోనా మహమ్మారితో అల్లల్లడిపోతున్న విషయం తెలిసిందే. దీంతో ఏ ఒక్కరూ కూడా బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఈ లాక్ డౌన్ సమయంలో పోలీసులకు విచిత్రమైన కేసులు వస్తున్నాయి. తాజాగా కేరళలో ఒకరు పిల్లుల ఆహరం కోసం బయటికెళ్లడానికి పర్మిషన్ ఇవ్వాలని కోర్తుకెక్కిన విషయం తెలిసిందే. అయితే తాజాగా హైదరాబాద్ లో కూడా  అలాంటి వింత ఘటనే ఒకటి చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్ ను కలవడానికి పర్మిషన్ కావాలంటూ వింత కోరికను కోరడం అంతా ఆశ్చర్యపోయారు.

నీకోరిక తగలడా ఏమిటిది ఈ కరోనా మహమ్మారి వేళ అంటూ సర్వత్రా గుసగుసలు వినపడ్డాయి. దాంతో ఏం చేయాలో తెలియక పోలీసులు తల పట్టుకున్నారు. ఇక్కడో ట్విస్ట్ జరిగింది. అదేమంటే.. అంతకు ముందు రోజే ఆ యువకుడు అమ్మాయి వద్దకు వచ్చినప్పుడు ఆ అమ్మాయి తల్లితండ్రులు తమ కూతురును వేదిస్తానున్నాడని కేసు పెట్టారు. పోలీసులు విచారించగా.. ఆ అమ్మాయిని ప్రేమించట్లేదని అది చెప్పడానికే తాను ఇంటికి వచ్చానని తెలిపాడు. ఇప్పుడు ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ను కలవడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందేనంటూ ఏకంగా స్టేషన్ ముందే బైఠాయించింది. దీంతో గొడవ లేకుండా నచ్చ జెప్పి పంపించడం పోలీసుల వంతు అయింది.