సుశాంత్ సింగ్ మరణం తట్టుకోలేక విశాఖ యువతి ఆత్మహత్య…..

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఒక యువతి ని ఆత్మహత్య కు ఉసిగొల్పేలా చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణం  శ్రీహరిపురానికి చెందిన ఒక కుటుంబం బీహార్ నుంచి వలస వచ్చింది. అయితే వారి కుమార్తె సుమకుమారి ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తోంది. ఆ యువతికి టిక్ టాక్ అంటే బాగా ఇష్టం.  ఈ వ్యసనానికి లోనైన ఆమెకు తాజాగా ఆత్మహత్య చేసుకున్న సుషాంత్ సింగ్ రాజ్ పుత్ అంటే ప్రాణం. అదే ఇష్టం ఆమె ప్రాణం తీసింది.

అయితే బాలీవుడ్ లో తాజాగా అతని మరణానికి సంబంధించిన విషయాలు స్క్రీన్ పై వైరల్ కావడం చూసిన ఆ  యువతి తీవ్ర ఒత్తిడికి లోనైంది. కాగా సుషాంత్ మరణించినప్పటినుంచి ఆ అమ్మాయి ఇంట్లో ఎవరిత మాట్లాడలేదు. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనైన ఆ యువతి తన బెడ్ రూమ్ లోకి వెళ్లి ఉరి వేసుకున్నట్టు కుటుంబసభ్యుల తెలిపారు.  కాగా పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. కాగా టిక్ టాక్ లో కూడా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ కావడంతో సుమకుమారి కుమారి చాలా డిప్రెషన్ కి గురై అది తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది.