ఏపీలో ప్రజలకు శుభవార్త.. నేడు ఒక్కో అకౌంట్‌లో రూ.10వేలు జమ

Jagan government's key decision for sports..!
Jagan government's key decision for sports..!

ఏపీ ప్రజలకు జగన్‌ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త అందించింది. జగనన్న చేదోడు పథకం లబ్ధిదారులకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి నిధులు విడుదల చేయనున్నారు. ఇవాళ సీఎం వైఎస్‌ జగన్‌ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జగనన్న చేదోడు పథకం లబ్ధిదారులకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి నిధులు విడుదల చేయనున్నారు.

ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 8.30 గంటలకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు..ఎమ్మిగనూరు వీవర్స్‌ కాలనీ వైడబ్ల్యూసీఎస్‌ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం జగనన్న చేదోడు పథకం లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్నారు. ఒక్కో అకౌంట్ లో రూ.10 వేలు జమచేస్తారు. అనంతరం తాడేపల్లికి సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి తిరుగు ప్రయాణం కానున్నారు. కాగా, జగనన్న తోడు పథకం లబ్ధిదారులను తరలించేందుకు బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వినతులు తీసుకునేందుకు గ్యాలరీ ఏర్పాటు చేయాలన్నారు.