గుడ్ న్యూస్ : టీవీ ప్రీమియర్ కి సిద్ధమైన “మార్క్ ఆంటోనీ”

Good news:
Good news: "Mark Antony" ready for TV premiere

కోలీవుడ్ యాక్టర్ విశాల్ మరియు ఎస్. జే. సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా మార్క్ ఆంటోనీ. ఇందులో వీరిద్దరూ డ్యూయల్ రోల్ లో నటించారు. అధిక్ రవిచంద్రన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించారు. ఈ మూవీ థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులని , అభిమానులను విశేషం గా ఆకట్టుకుంది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులని జీ తెలుగు సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

Good news: "Mark Antony" ready for TV premiere
Good news: “Mark Antony” ready for TV premiere

ఈ మూవీ జీ తెలుగు లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులని అలరించడానికి రెడీ అయిపోయింది. మే 12, 2024 న సాయంత్రం 6:00 గంటలకి ప్రసారం కానుంది. ఈ మూవీ లో రీతూ వర్మ, సునీల్, సెల్వరాఘవన్, అభినయ, రెడిన్ కింగ్స్లీ, వై.జి.మహేంద్రన్ లు కీలక పాత్రల్లో నటించారు. ఎస్ వినోద్ కుమార్ నిర్మించిన ఈ మూవీ కి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. బుల్లితెర పై ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.