టాలీవుడ్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో, ఏ. హర్ష దర్శకత్వం లో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ భీమా. ఈ మూవీ మార్చి 8, 2024 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ గా కూడా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులని అలరించడానికి రెడీ అయిపోయింది.
![టీవీ ప్రీమియర్ కు సిద్ధమైన గోపీచంద్ “భీమా”..! Gopichand "Bhima" ready for TV premiere..!](https://i0.wp.com/telugu.telugubullet.com/wp-content/uploads/2024/05/Untitled-design-61.jpg?resize=300%2C197&ssl=1)
ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఆదివారం స్టార్ మా ఛానెల్ లో మధ్యాహ్నం 1:00 గంటలకి భీమా మూవీ ప్రసారం కానున్నది . ఈ మూవీ లో ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ లేడీ లీడ్ రోల్స్ లో నటించగా, నాజర్, నరేష్, పూర్ణ, వెన్నెల కిషోర్, రఘుబాబు, ముఖేష్ తివారీ, చమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్రల ల్లో నటించారు. ఈ మూవీ కి రవి బస్రూర్ సంగీతం అందించారు.