ఆరోగ్యకరమైన ఆహారం అవసరం

ఆరోగ్యకరమైన ఆహారం అవసరం

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం భారత దేశం మొత్తంలో 63 శాతం మరణాలు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వలన జరిగితే… 27శాతం మరణాలు కార్డియో వాస్క్యులర్ డిసీజెస్ వలన జరుగుతున్నాయి. అయితే ఆ కార్డియో వాస్క్యులర్ డిసీజెస్‌కు గల కారణాలలో హైపర్ టెన్షన్ ఒక మూల కారణమే. బ్లడ్ ప్రెజర్ ఎప్పుడైతే 120/80 కంటే ఎక్కువగా ఉంటే దానిని హైపర్టెన్షన్ అంటారు మరియు హైపర్ టెన్షన్ లేదా హైబీపీ‌కు ట్రీట్మెంట్ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. తరచుగా బిపిను చెక్ చేసుకుంటూ ఉండాలి మరియు డాక్టర్ సూచనల మేరకు మెడిసిన్స్ తీసుకోవాలి.

సహజంగా ప్రతి ఒక్కరూ ఎటువంటి అనారోగ్యకరమైన లక్షణాలు కనిపించినా వెంటనే జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే హై బీపీ వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు కూడా కనిపించే అవకాశాలు ఉండవు. అందుకే హైబీపీని సైలెంట్ కిల్లర్ అని అంటారు. ఎటువంటి లక్షణాలు కనపడక పోవడంతో ఆరోగ్యంపై దృష్టి ఉండదు మరియు అదే కొనసాగితే అధిక రక్తపోటు వలన గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ సమస్య తీవ్ర స్థాయికి చేరితే ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం హైబీపీ వచ్చినా సరే మీ శరీరంలో ఏదో తప్పు జరుగుతుంది అని ఎటువంటి లక్షణాలు ద్వారా తెలియవు అని అన్నారు. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు వచ్చినా ప్రమాదం గురించి తెలుసుకుని మంచి మార్గాన్ని ఎంచుకోవాలి. వీటితో పాటు ఈ సమస్యకు అనుగుణంగా నడుచుకోవాలి అని సూచించారు.

సహజంగా హైబీపీని క్యూర్ చేయడం సాధ్యం కాదు కాకపోతే కొంత వరకు జీవనశైలి మరియు మెడిసిన్స్ ద్వారా క్యూర్ చేయవచ్చు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారు ఇంకొక విషయాన్ని కూడా తెలియజేశారు సాధారణంగా ఎటువంటి లక్షణాలు హైబిపి ఉన్న వారికి కనపడక పోగా చాలా తక్కువ శాతం మందికి ఈ లక్షణం కనబడుతుంది అని తెలియజేశారు. హైబీపీ సమస్యతో బాధపడేవారికి తలనొప్పితో పాటు నోస్ బ్లీడింగ్ అవుతుంది. ఇదే లక్షణం కనిపిస్తే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించండి లేకపోతే స్పృహ కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఎప్పుడైతే అధిక రక్తపోటు లేదా హైపర్టెన్షన్ సమస్య వస్తుందో అప్పటి నుండి శారీరక మార్పులతో పాటు మానసికంగా కూడా చిన్నచిన్న మార్పులు జరుగుతాయి. ఉదాహరణకు మెట్లు ఎక్కడం, వాకింగ్ మరియు ఏవైనా బరువులు మోసినప్పుడు ఊపిరి తీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. మానసిక ఆరోగ్యం విషయానికొస్తే ఆందోళన ఎక్కువగా ఉంటుంది.

మీ రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి శారీరకంగా మార్పులు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అధిక బరువు ఉండటం వలన మరెన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి తగినంత వ్యాయామం ప్రతి రోజు క్రమం తప్పకుండా చేస్తూ ఉండండి. దాంతో ఆరోగ్యంగా ఉంటారు, బరువు మరియు రక్తపోటు అదుపులో ఉంటాయి.

హృదయ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. శారీరక ఆరోగ్యం ఎంత అవసరమో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం అంతే అవసరం. రోజువారీ తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వంటివి తీసుకోవాలి. వీలైనంతవరకు చక్కెరను, ఆయిల్ ను తగ్గించండి. మీరు తీసుకునే కేలరీలపై దృష్టి పెట్టండి ప్రాసెస్డ్ ఫుడ్స్, హై సోడియం ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అసలు తీసుకోకండి. ఇలా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. అలానే సమస్యలు లేకుండా ఆనందంగా జీవించచ్చు.