చీపురు పట్టి చెత్త ఊడ్చిన హేమామాలిని: వీడియో

hema malini take part in swacch bharat abhiyan

న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రాంగణంలో శనివారం ఉదయం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమా మాలిని చీపుర్లు పట్టి ప్రాంగణంలో చెత్త ఊడ్చారు. అనంతరం సిబ్బందితో కలిసి చెత్తను ఏరిపారేశారు. వీరితో పాటు మరికొంత మంది బీజేపీ ఎంపీలు, సిబ్బంది కూడా స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఉభయసభల్లో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై చర్చ జరుగుతోంది.