ఈడీ కార్యాలయం వద్ద హైటెన్షన్

హైదరాబాద్ ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతల నిరసనతో ఉద్రిక్తత నెలకొంది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పేర్లను చార్జ్‌షీట్‌లో చేర్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వీహెచ్, ఎమ్మెల్యేలు మురళినాయక్, ఈర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.