రూ. 10వేల కోట్ల కుంభకోణం బయటకు రావాలంటే విచారణ జరపాల్సిందేనని మాజీ మంత్రి కేటీఆర్ పట్టుపట్టారు. హెచ్సీయూలో ఏ సమస్య ఉన్నా వస్తానని రాహుల్ గాంధీ గతంలో చెప్పారని.. ఇప్పుడు ఎక్కడ ఉన్నారని నిలదీశారు. చెరువును తాకట్టు పెట్టిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని ఆరోపణలు చేశారు. ఏఐ వీడియోలు లేవన్న జస్టిస్ గవాత్ మీద కూడా రేవంత్ రెడ్డి కేసులు పెట్టగలరని అన్నారు. ఇప్పుడు ఐఏఎస్, ఫారెస్ట్ అధికారుల వంతు అయిందని.. ఆ తర్వాత పోలీస్ అధికారుల వంతు వస్తుందని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి సొంత సైన్యం మాదిరి పనిచేస్తోన్న కొంతమంది పోలీస్ అధికారులు మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.