తెలంగాణలో పలు రకాల భూ సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో రానున్న రోజుల్లో అనేక భూ సమస్యలకు పరిష్కారం లభించనుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న భూ భారతి చట్టం, భూముల సమస్యలను పరిష్కారానికి ఒక మంచి అవకాశమని మంత్రి తెలిపారు. ఈ క్రమంలో రేపు అనగా ఏప్రిల్ 17 నుంచి ఈ చట్టాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చట్టం ద్వారా, భూముల సంబంధిత వివాదాలను త్వరగా పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.