
పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారంనాడు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రానికి కీలక ప్రశ్నలు వేసింది. సుమారు 73 పిటిషన్లపై సీజేఐ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మసానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లలో ముస్లిమేతరలను చేర్చే నిబంధనను ధర్మాసనం ప్రస్తావించింది. హిందూ ఎండోమెంట్ బోర్డులలో ముస్లింలు భాగం కావడానికి కేంద్రం అనుమతిస్తుందా అని సూటిగా ప్రశ్నించింది.