రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వారిపై కేసులు

rahul gandhi in telangana
rahul gandhi in telangana

దేశ వ్యాప్తంగా బీజేపీ ఫాసిస్టు పాలన చేస్తోందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. రాహుల్ గాంధీకి పెరుగుతున్న ఇమేజ్‌ను చూసి ఓర్వలేక మోదీ సర్కార్ అక్రమ కేసుల కుట్రలకు తెరలేపిందని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు నిజాలు తెలియాలని తాము ధర్నా చేస్తున్నామని అన్నారు. హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీసు ఎదుట ఇవాళ టీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ ధర్నాలో మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని మీడియాతో మాట్లాడారు. నేషనల్ హెరాల్డ్ పేపర్‌కి రూ.90 కోట్లు రుణం ఇస్తే మనీలాండరింగ్ జరిగినట్లు ఎలా అవుతుందని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెట్టారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.