బిగ్ బాస్ డైరెక్టర్స్ శ్రీముఖి ఫ్రెండ్స్ అంటున్న హిమజ

బిగ్ బాస్ డైరెక్టర్స్ శ్రీముఖి ఫ్రెండ్స్ అంటున్న హిమజ

సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగానే శ్యామ్ అనే వ్యక్తి శ్రీముఖికి సహాయం చేస్తున్నాడంటూ హిమజ సంచలన వ్యాఖ్యలు చేసింది. శ్రీముఖికి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇస్తున్నారని.. ఇతర ఇంటి సభ్యుల కంటే శ్రీముఖికి ప్రత్యేకమైన ట్రీట్ మెంట్ లభిస్తుందని,తాను చెప్పే ప్రతి మాటకు సాక్ష్యం ఉందని.. ఇంటి సభ్యులు అంతా కూడా నా మాటలకు సాక్ష్యం అని హిమజ తాజా గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన దాదాపు ప్రతి ఒక్కరు కూడా  టీవీ ఛానెల్స్ తో పాటు యూట్యూబ్ ఛానెల్స్ కి  ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఇటీవలే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన హిమజను నూతన్ నాయుడు ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో హిమజ సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు బిగ్ బాస్ షో పైనే కామెంట్స్ చేసింది.

నాగార్జున షో చూడకుండానే హోస్టింగ్ చేస్తున్నాడంటూ కామెంట్ చేసిన హిమజ అదే ఇంటర్వ్యూలో శ్రీముఖిపై కూడా సంచలన ఆరోపణలు చేసింది. శ్రీముఖికి షో నిర్వాహకులు హెల్ప్ చేస్తున్నారంది. బిగ్ బాస్ డైరెక్టర్స్ కు కూడా శ్రీముఖి అప్పుడప్పుడు కెమెరా ముందుకు వచ్చి సలహాలు ఇచ్చేది. ఏదైనా టాస్క్ ఎంటర్ టైన్మెంట్ ను ఇవ్వకపోతే వెంటనే శ్రీముఖి కెమెరా వద్దకు వెళ్లి ఈ టాస్క్ ఆసక్తి లేదు. మీరు ఇంకేదైనా టాస్క్ ఇవ్వండి అంటూ సలహాలు ఇవ్వడం నేను చూశానంటూ హిమజ సంచలన కామెంట్స్ చేసింది.

బిగ్ బాస్ అందరికి జింగిల్స్ చేసుకోవాల్సిందిగా చెప్పారు. అప్పుడు అందరు కూడా వారి పద్దతికి తగ్గట్లుగా చేయించుకున్నారు. వరుణ్ మరియు రాహుల్ లు ఆ జింగిల్స్ ను రాశారు. వారితో శ్రీముఖి కావాలని బిగ్ బాస్ కు బాస్ నువ్వమ్మా అంటూ రాయించుకుంది. అలా వేరే వారు ఎవరైనా రాయించుకుంటే ఖచ్చితంగా తీయించే వారు. కాని శ్రీముఖి రాయించుకోవడం వల్ల బిగ్ బాస్ టీం ఎవరు కూడా పట్టించుకోలేదు.తాను చెప్పే ప్రతి మాటకు సాక్ష్యం ఉందని.. ఇంటి సభ్యులు అంతా కూడా నా మాటలకు సాక్ష్యం అంది.

బిగ్ బాస్ హెడ్ అయిన శ్యామ్ గారు మరియు అభిషేక్ గారు తనకు చాలా క్లోజ్ అంటే మొదటి వారంలోనే అందరి ముందు శ్రీముఖి చెప్పింది. అలా చెప్పడం వల్ల ఇంటి సభ్యులు అంతా తనకు భయపడాలని ఆమె భావించి ఉంటుందని హిమజ పేర్కొంది.