ఏపీలో భారీగా కరోనా కేసులు… మొత్తం 722

ఆంధ్రరప్రదేస్ లో రోజు రోజుకూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒక్కసారిగా కరోనా కేసులు భారీగా నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టుగా.. తాజాగా మీడియాకు రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్ 130లో అధికారులు పేర్కొన్నారు. దీంతో.. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 722కు చేరింది.

అయితే ఇప్పటి వరకు 92 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా.. 20 మంది మృతిచెందారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 610 మంది చికిత్స పొందుతున్నారు. ఇక.. గత 24 గంటల్లో చిత్తూరులో 25 కేసులు నమోదు కాగా.. గుంటూరులో 20, కర్నూలులో 16, కృష్ణా జిల్లాలో 5, అనంతపురంలో 4, కడపలో 3, తూర్పు గోదావరి జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. కాగా 174 పాజిటివ్ కేసులతో కర్నూలు జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉంది.