మరదలితో అక్రమ సంబంధం, భర్తను బట్టలు చిరిగేలా చితకబాదిన భార్య

పిల్లలు కలగలేదని భార్యను తీవ్రంగా వేధింపులకు గురిచేచేసి ఇంట్లో నుండి వెళ్ళకొట్టి మరదలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఒక ప్రబుద్దుడు. ఏకంగా ఇంట్లోనే తెచ్చి పెట్టుకున్నాడు. ఇదేమిటని ఇళ్ళ చుట్టుపక్కల వారు నిలదీస్తే.. రెండో పెళ్లి చేసుకున్నానని చెప్తున్నాడు. దీంతో కోపోద్రిక్తురాలైన భార్య తన బంధువులతో కలిసి భర్తను చితకబాదింది. భద్రాద్రి కొత్తగూడెంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం రామవరానికి చెందిన సాంబశివరావు అనే వ్యక్తితో శైలజ అనే మహిళకు ఐదేళ్ల కిందట వివాహమైంది. రెండేళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. అనంతరం పిల్లలు పుట్టలేదనే కారణంగా కలతలు చోటుచేసుకున్నాయి. దీంతో ఆమె ఏడాదిగా ఆమె తన తల్లిగారి ఇంట్లో ఉంటోంది. భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో సాంబశివరావు ఆగడాలు మితిమీరాయి. తన మరదలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమెను తీసుకొచ్చి ఏకంగా ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఇరుగుపొరుగు వారు ప్రశ్నించగా ఆమె తన భార్య అని, రెండో పెళ్లి చేసుకున్నానని చెప్పుకుంటూ వస్తున్నాడు. విషయం తెలుసుకున్న శైలజ శుక్రవారం (ఏప్రిల్ 19) తన బంధువులతో కలిసి భర్త ఇంటి వద్దకు వచ్చింది. బాధితురాలు శైలజ తన భర్త సాంబశివరావును నిలదీయడానికి వెళ్లగా.. అతడు తలుపులు తీయలేదు. పైగా తిక్క సమాధానాలు చెప్పాడు. దీంతో కోపోద్రిక్తురాలైన శైలజ.. అతణ్ని ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చి అందరూ చూస్తుండగానే బట్టలు చిరిగేలా చితకబాదింది. తనకు న్యాయం చేసేవరకు ఇక్కడి నుంచి కదిలేదిలేదని తేల్చి చెప్పింది. భర్త ఇంటి ముందు న్యాయపోరాటానికి దిగింది.