మాస్ మహారాజ రవితేజ హీరోగా, ప్రియా భవాని శంకర్ కథానాయికగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ Irumudi. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్గా నిలిచింది. ఇప్పటికే రెండు వారాంతాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం మూడో వారాంతంలోకి అడుగుపెట్టింది.
అయితే మూడో వారంలోకి వచ్చిన తర్వాత కూడా ‘ఇరుముడి’ జోరు ఏమాత్రం తగ్గకపోవడం విశేషంగా మారింది. ముఖ్యంగా డే 15కు కూడా ఈ సినిమాకు భారీ స్థాయిలో బుకింగ్స్ నమోదవుతున్నాయి. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్మైషోలో 15వ రోజుకు ఏకంగా లక్షకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది.
సినిమా విడుదలై 15 రోజులు పూర్తవుతున్నా ఈ స్థాయిలో బుకింగ్స్ కొనసాగుతుండటంతో ‘ఇరుముడి’ మేనియా ఇంకా గట్టిగానే ఉందని చెప్పొచ్చు. సాధారణంగా మూడో వారంలో సినిమాల బుకింగ్స్ కాస్త తగ్గుముఖం పడతాయి. కానీ ‘ఇరుముడి’ మాత్రం అందుకు భిన్నంగా దూసుకెళ్తోంది.
ముఖ్యంగా శుక్రవారం రోజే ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం ఆసక్తికరంగా మారింది. ఇక శనివారం, ఆదివారం వీకెండ్ కావడంతో బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. వీకెండ్లో ‘ఇరుముడి’ మరింత బలమైన వసూళ్లు సాధిస్తుందా అనేది ఆసక్తిగా మారింది.
మొత్తానికి రెండు వారాలు పూర్తయినా థియేటర్లలో ‘ఇరుముడి’ హవా కొనసాగుతుండటం రవితేజ అభిమానులకు మంచి కిక్ ఇస్తోంది. మూడో వారాంతంలో ఈ సినిమా ఎలాంటి నంబర్స్ నమోదు చేస్తుందో చూడాలి.





