జగన్ కు మాస్ పొలిటీషియన్ గా మంచి క్రేజ్

జగన్ కు మాస్ పొలిటీషియన్ గా మంచి క్రేజ్

వైసీపీ అధినేత మరియు ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్ కన్నా దశాబ్దపు నాటి కల ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చెయ్యడం.ఎన్నో ఏళ్ళు పడ్డ శ్రమకు ఫైనల్ గా 2019లో ఫలితం దక్కింది.అది కూడా మామూలు స్థాయిలోనా??చరిత్రలో నిలిచిపోయే రేంజ్ విజయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందించారు.అయితే జగన్ కు మాస్ పొలిటీషియన్ గా మంచి క్రేజ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

అలాగే మరోపక్క అతని పాదయాత్రలో భారీగా తరలి వచ్చే జనాన్ని ఆయా ప్రాంతపు ఇంచార్జ్ లు డబ్బులు మందు బిర్యానీలు ఇచ్చి పోగేస్తున్నారన్న వదంతులు కూడా అనేకం ఉన్నాయి.అలా అని కాకపోయినా జగన్ కు మంచి క్రేజ్ ఉంది.అయితే అసలు ఊహించని చోట్ల కూడా ఈసారి వైసీపీ జెండా ఎగురవేయడం గమనార్హం.అలాంటి ప్రాంతాల్లో విశాఖ జిల్లా కూడా ఒకటి.

కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే అక్కడే మొట్టమొదటి సారిగా ఇన్ని నెలలో ముఖ్యమంత్రి స్థానంలో జగన్ కు ఘోరమైన అవమానం చోటు చేసుకుంది.వైసీపీ వాళ్ళు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్లాన్ చేసిన మహా మానవహారం అట్టర్ ప్లాప్ అయ్యి కూర్చుంది.దానికి తోడు జగన్ వెంట కనీసం ఊహించిన స్థాయిలో కూడా జనం హాజరు కాకపోవడం మరింత ఆశ్చర్యకరం.ఇది ఖచ్చితంగా జగన్ కు ఘోరమైన అవమానమే అని చెప్పాలి.అందువల్లే కాబోలు జగన్ విశాఖ ఉత్సవాల్లో కూడా మాట్లాడకుండా వెనుదిరిగారు.