జియో శాంసంగ్‌ 5జీ సేవలు

జియో శాంసంగ్‌ 5జీ సేవలు

అతిపెద్ద డిజిటల్‌ సాంకేతికత ఈవెంట్‌ ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌(ఐఎంసీ)ఢిల్లీలో జరుగుతుంది.ఈ నెల 14 నుంచి 16 వరకూ జరుగుతున్న ఈ ఈవెంట్ దక్షిణాసియా మరియు భారత్‌లోనే అతిపెద్దది. జియో ప్రపంచంలోనే అతిపెద్ద 4జీ ఎల్‌టీఈ నెట్‌వర్క్‌ ఇంకా గ్రీన్‌ఫీల్డ్‌ నెట్‌వర్క్‌ను శాంసంగ్‌ భాగస్వామ్యంతో  ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి నెక్ట్స్‌ జనరేషన్‌ టెక్నాలజీ 5జీ మోడల్స్‌ ను ఈ ఈవెంట్ లో ప్రదర్శించడం జరిగింది.

శాంసంగ్‌,రిలయన్స్ జియోలు ఈ నెక్ట్స్‌ జనరేషన్‌ టెక్నాలజీ 5జీ, ఎల్‌టీఈ మోడల్స్‌ ను ప్రదర్శించాయి. 4జీ ఎల్‌టీఈ మరియు 5జీ టెక్నాలజీని మిళితం చేసి అత్యున్నత సేవలని ఎలా వినియోగదారులకు అందించవచ్చు అనేది వివరణ ఇచ్చాయి.రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌ ప్రెసిడెంట్‌ మ్యాథ్యూ ఊమెన్‌ మాట్లాడుతూ నిరంతరం డేటా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వినియోగదారుల జీవితంలో చాలా మార్పులు తీసుకువచ్చామని తెలిపారు.