కమల్, నయనతార కాంబో రిపీట్..నిజమేనా..?

కమల్, నయనతార కాంబో రిపీట్..నిజమేనా..?
Cinema News

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా లెజెండరీ దర్శకుడు మణిరత్నంతో మళ్ళీ చాన్నేళ్లకి ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రం కమల్ కెరీర్ లో 234వ చిత్రం. ఈ సినిమా సహ నిర్మాతలలో కమల్ కూడా ఒకరు. కాగా ఈ లో సినిమా లో హీరోయిన్ గా మొదట్లో త్రిష పేరు వినిపించింది. ప్రస్తుతం నయనతార పేరు బాగా వినిపిస్తోంది. నిజానికి ఆ మధ్య ఐశ్వర్య రాయ్ కథానాయికగా నటించడం దాదాపు ఖరారైయింది అని చెప్పారు . మరి చివరకు ఈ ముగ్గురు హీరోయిన్స్ లో ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి.

కమల్, నయనతార కాంబో రిపీట్..నిజమేనా..?
Kamal Hasaan, Nayanatara

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మణిరత్నం ఆస్థాన విద్వాంసుడు ఏఆర్ రెహమాన్ కమల్ #234కి మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఏది ఏమైనా మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత కమల్ – మణిరత్నం కాంబోలో మరో మూవీ రాబోతుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.