Election Updates: నిలకడలేని రాజకీయాలు… యు టర్న్ తీసుకున్న కోమటిరెడ్డి ?

Election Updates: Former MLA Komatireddy Rajagopal Reddy joined his own house
Election Updates: Former MLA Komatireddy Rajagopal Reddy joined his own house

తెలంగాణాలో రానున్న 37 రోజుల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అన్ని పార్టీలు ఈ ఎన్నికల్లో విజయాన్ని సాధించడం కోసం వ్యూహాలతో సిద్ధంగా ఉన్నాయి. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం మాజీ కాంగ్రెస్ నేత మరియు ప్రస్తుతం బీజేపీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యు టర్న్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణాలో ఈ విషయంపైన చర్చ జరుగుతోంది, రేపు ఢిల్లీలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ సమక్షములో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరుతారని తెలుస్తోంది.

కోమటిరెడ్డికి మునుగోడు లేదా ఎల్బీ నగర్ లలో ఒకచోట నుండి పోటీ చేసే అవకాశాన్ని కల్పించనున్నట్లు ప్రచారంలో ఉంది. నిన్న బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో కోమటిరెడ్డి పేరు లేకపోవడంతోన లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఎందుకు ఇలా నిలకడ లేని రాజకీయాలు చేయడం అంటూ రాజకీయ విశ్లేషకులు ఆయనపై విమర్శలు చేస్తున్నారు.