ముంబైకి కేసీఆర్….ఆయన ఆహ్వానం కోసమే ?

kcr going to vijayawada

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు ముంబై వెళ్లనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆహ్వానించనున్నారు. తెలంగాణ వరప్రదాయినిగా అభివర్ణించే కాళేశ్వరం ప్రాజెక్ట‌ును జూన్ 21న ప్రారంభిస్తోన్న సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, ముంపు విషయంలో మహా సర్కారు తెలంగాణకు పూర్తి సహకారం అందించిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం నిర్మాణానికి కేసీఆర్ చొరవ తీసుకొని హరీశ్‌ రావును ముంబై పంపారు. కేసీఆర్ సర్కారు వినతికి ‘మహా’ సీఎం ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించడంతోనే కాళేశ్వరం సాకారమైంది. తాజాగా ప్రాజెక్టు పూర్తి కావడంతో ఫడ్నవీస్‌తోపాటు.. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కూడా ముఖ్య అతిథులుగా కేసీఆర్ ఆహ్వానిస్తున్నారు. ఫడ్నవీస్‌ను ఆహ్వానించిన తర్వాత నీతి ఆయోగ్ భేటీలో పాల్గొనడం కోసం తెలంగాణ సీఎం ఢిల్లీ వెళ్తారు. సుమారు 151 టీఎంసీల గోదావరి జలాలను ఒడిసిపట్టి యావత్ తెలంగాణను సస్యశ్యామలం చేసే లక్ష్యంతో కేసీఆర్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు నిర్మాణంలో, ముంపు విషయంలో మహారాష్ట్ర సర్కారు తెలంగాణకు పూర్తి సహకారం అందించింది. కేసీఆర్ వినతికి సీఎం ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించడంతోనే కాళేశ్వరం కల సాకారమైంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర మావోల ప్రాబల్యం ఉండంటం అదీకాక ముగ్గురు సీఎంలు వస్తుండటంతో వరంగల్‌ రేంజ్‌ ఐజీ నాగిరెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు వేల మంది పోలీసులతో కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూ భద్రత పెంచారు.