మానవత్వాన్ని చాటిన బుడ్డొడు: బుడ్డోడి కరోనా విరాళం ఎంతో తెలుసా..!

ఆంధ్రప్రదేశ్ లోని బెజవాడకు చెందిన ఓ బుడ్డోడు సైకిల్ కొనుక్కుందామని దాచుకున్న డబ్బులను కరోనాపై పోరాడటానికి విరాళంగా ఇచ్చాడు. ఇండియా చూద్దానికి ఎలా ఉన్నా.. బ్ర‌త‌కడానికి మాత్రం చాలా బాగుంటుంది అని ప్రముఖ సినీ రచయిత రాసిన డైలాగు. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో కరెక్ట్ గా కనెక్ట్ అయింది. కరోనా వైరస్ మహమ్మారి ఇండియాను కమ్మేసిన ఈ సమయంలో… ప్రధాని నరేంద్ర మోదీ లాక్ డౌన్ కు భారతీయులంతా ఒక్క తాటిపైకి వచ్చి నిలబడ్డారు. ఎందరో మహానుభావులు, ఆపై వ్యాపార దిగ్గజాలు, సినీ సెలబ్రిటీలు.. ఇలా ఒకరేమిటి అందరూ కూడా మేము సైతం అంటూ డొనేషన్లు చేసి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే పోరాటంలో అండగా నిలుస్తున్నారు.

కాగా తాజాగా ఈ జాబితాలోకి ఓ బుడ్డోడు చేరాడు. కరోనా భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్న ఈ సమయంలో సైకిల్ కొనుక్కోవాలని దాచుకున్న ఓ బుడ్డోడు.. కరోనాపై పోరాడేందుకు ప్రభుత్వానికి అండగా నిలిచాడు. ఏపీలోని విజయవాడకు చెందిన నాలుగేళ్ల కుర్రాడు హేమంత్ సీఎం సహాయనిధికి తాను దాచుకున్న రూ. 971ని విరాళమిచ్చి.. అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఎంత డబ్బు ఉంటే ఏం లాభం.. నలుగురికి సాయం చేయాలన్న మంచి మనసును చాటుకున్నాడు. దీంతో చిన్నారులకు కూడా కరోనా తాకిడి… దానిపై అవగాహన ఏపాటిది అనేది అర్థం చేసుకోవచ్చు.