కంగనాకి దెబ్బ కొట్టేలా క్రిష్ ప్లాన్

ఎన్టీఆర్ సిరీస్, ‘మణికర్ణిక’ తరువాత క్రిష్ ఇంతవరకు తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేయలేదు. కారణం ఎన్టీఆర్ సిరీస్, ‘మణికర్ణిక’ ఫలితాలు క్రిష్ ను బాగానే ఇబ్బంది పెట్టాయి. అందుకే ఈసారి తను చేసే సినిమాలో తన మార్క్ ఉండేలా చూసుకోవాలని క్రిష్ డిసైడ్ అయ్యాడట. అందుకే ప్రస్తుతం అతను తన నెక్స్ట్ మూవీ స్క్రిప్ట్ పనుల్లో ఫుల్ బిజీ అయిపోయాడు. మరోసారి క్రిష్ బాలీవుడ్ లో సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. అది కూడా అక్కడ స్టార్ హీరోతో కావడం విశేషం. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కోసం క్రిష్ ఓ కథ రాశారట. ఆల్రెడీ క్రిష్ అక్షయ్ ను కలిసి స్టోరీ చెప్పాడట. స్టోరీ నచ్చిన అక్షయ్ కుమార్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. గతంలో క్రిష్.. అక్షయ్ తో ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ సినిమా చేసి భారీ విజయం సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ కాంచన రీమేక్‌ లక్ష్మీ బాంబ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. మణికర్ణిక వివాదం కొనసాగుతున్నప్పుడే క్రిష్ రూపొందించిన ఎన్టీఆర్ బయోపిక్‌ సినిమా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో క్రిష్ కొంత నిరాశకు గురయ్యారనేది సినీ వర్గాల టాక్. ఎన్టీఆర్ బయోపిక్ ఫ్లాప్ కావడంపై క్రిష్‌ను ఉద్దేశించి కంగన రనౌత్ కొన్ని ఘాటైన కామెంట్లు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో ఓ గట్టి హిట్టు కొట్టి కంగనకు ఝలక్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మరి క్రిష్ ఈ సినిమాతో అయినా హిట్ కొడతాడేమో చూద్దాం.