స్నేహితుడి భార్య మీద కన్నేసి…స్నేహితుడినే చంపేశాడు

like his friends wife and killed his friend

రాన్రాను మనుషుల మధ్య సంబంధాలు క్రూరంగా మారుతున్నాయి. తాజాగా ఫ్రెండ్‌ భార్య మీద కన్నేసిన ఓ వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకునేందుకు స్నేహితుడి ప్రాణాలు తీసి పోలీసులకి దొరికిపోయాడు. పశ్చిమ ఢిల్లీలోని మోహన్ గార్డెన్ ప్రాంతంలో దల్బీర్ అనే వ్యక్తి భార్యతో కలిసి నివసిస్తున్నాడు. దల్బీర్‌తో కలిసి ఫ్యాక్టరీలో పనిచేసే కుల్కేష్ అనే వ్యక్తి ఏడాది కాలంగా వారింటి పక్కనే ఉంటున్నాడు. బ్యాచిలర్ అయిన కుల్కేష్ తరుచూ దల్బీర్ ఇంటికి వెళ్తూ అతడి భార్య పూజపై మనసు పారేసుకున్నాడు. ఆమెను మచ్చిక చేసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసేవాడు. ఇంటి పనుల్లో సాయం చేస్తూ, అప్పుడప్పుడు గిఫ్టులు ఇస్తూ పూజతో స్నేహంగా మెలిగేవాడు. ఈ విషయం తెలుసుకున్న దల్బీర్ తనింటికి రావొద్దని కుల్కేష్‌తో గొడవ పెట్టుకుని అతడితో మాట్లాడటం మానేశాడు. దీంతో దల్బీర్‌పై పగ పెంచుకున్న కుల్కేష్ అతడిని అడ్డు తొలగించుకుంటే పూజ విధవ రాలు అయ్యాక పెళ్లి చేసుకుని సుఖపడొచ్చని భావించాడు. సోమవారం రాత్రి పూజ బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లిందని తెలుసుకున్న కుల్కేష్ మాట్లాడాలి రమ్మని దల్బీర్‌ను ఇంటి సమీపంలోని రైల్వే ట్రాక్ దగ్గరికి రప్పించాడు. కొంత సమయం తర్వాత దల్బీర్‌పై దాడికి పాల్పడ్డాడు. అతడిపై రాళ్ల వర్షం కురిపించడంతో తీవ్రగాయాలతో దల్బీర్ కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత అతడిని రైల్వే ట్రాక్‌ పైకి లాగి వెళ్లిపోయాడు. చీకట్లో రైళ్లు వెళ్లడంతో దల్బీర్ శరీరం ముక్కలైంది. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి తన ఫ్రెండ్ దల్బీర్ రైలు కింద పడి చనిపోయాడని చెప్పాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. అయితే కుల్కేష్ షర్ట్‌పై రక్తం పడి ఉండటం, దల్మీర్ మృతదేహం కూడా అనుమానాస్పద స్థితిలో కనిపించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా తానే నేరం చేసినట్లు అంగీకరించాడు.