ఆర్థిక రాజధానిలో ముంబై భారీ అగ్ని ప్రమాదం

ఆర్థిక రాజధానిలో ముంబై భారీ అగ్ని ప్రమాదం

ఆర్థిక రాజధాని ముంబై, మంఖుర్ద్ ప్రాంతంలోని స్క్రాప్‌యార్డ్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ వివరాలు.. మంఖుర్ద్‌లో ఉన్నస్క్రాప్‌యార్డ్‌లో ఈ తెల్లవారుజామున ఉన్నట్లుండి భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.

విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక శాఖ 6 ఫైర్‌ ఇంజన్లను ఘటనా స్థలానికి తరలించింది.ఇప్పటి వరకు, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఇక అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.