రైతులని ఆదుకుంటామని హామీ ఇచ్చిన మంత్రి

రైతులని ఆదుకుంటామని హామీ ఇచ్చిన మంత్రి

ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న మహమ్మారి కరోనా వైరస్ కారణంగా రాష్ట్రమంతటా కూడా తల్లక్రిందులు అవుతున్న తరుణంలో, మరొకవైపు రాష్ట్రంలో దారుణంగా కురుస్తున్నటువంటి అకాల వర్షాల కారణంగా రైతులందరూ కూడా తీవ్రమైనఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. కాగా ఈ తరుణంలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. కాగా అకాల వర్షాల కారణంగా రైతులు కష్టపడి పండించిన పంట అంతా కూడా నష్టపోయిందని, అందుకని సదరు అధికారులతో మంత్రి కన్నబాబు ఒక సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా నష్టపోయిన పంట వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి కన్నబాబు, పంట నష్టంపై సీఎం జగన్ విచారణ చేపట్టారని వెల్లడించారు. అంతేకాకుండా నష్టపోయిన పంట వివరాలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం తరపున రాష్ట్ర రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి కన్నబాబు హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఇది రైతు ప్రభుత్వం అని, రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఈ విషయంలో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు వివరించారు.