మురళీమోహన్ ఇంట మరో షాక్ !

Murali Mohan daughter-in-law

నిన్ననే మాజీ ఎంపీ, టీడీపీ నేత మురళీ మోహన్ తల్లి కన్నుమూసిన సంగతి తెలిసిందే. అది మరువక ముందే వారి కుటుంబానికి మరో షాక్ తగిలింది. మురళీమోహన్ తల్లి వసుమతిదేవి (100) నిన్న ఉదయం విశాఖపట్నంలో అనారోగ్యంతో మృతిచెందారు. ఆమె అంత్యక్రియలు ఈరోజు రాజమహేంద్రవరంలో జరగనున్నాయి. అయితే ఈ కార్యక్రమానికి వెళ్తున్న మురళీ మోహన్ కోడలు మాగంటి రూప కార్ కి యాక్సిడెంట్ జరిగింది. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఆమె గాయపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన మరోకారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రూపకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. సహాయకులు ఆమెను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. మాగంటి రూప తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి మురళీమోహన్ గెలవగా ఆయన పోటీకి దూరంగా ఉండటంతో ఆ సీటును ఆయన కోడలికి టీడీపీ అధిష్ఠానం కేటాయించింది.