దారుణం…యువతీ సజీవదహనం….ఉరి ?

కర్ణాటకలోని రాయచూర్ లో ఇంజినీరింగ్ చదువుతున్న యువతి హత్య సంచలనం రేపుతోంది. ఈ నెల 15న ఆమె మీద మిస్సింగ్ కేసు నమోదైంది. ఏప్రిల్ 16న రాయ్ చూర్ శివారులోని అడవి ప్రాంతంలో ఆమె డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. సగం శరీరం కాలిపోయిన పరిస్థితిలో ఓ చెట్టుకు వేలాడుతూ ఆమె డెడ్ బాడీ ఉంది. ఈ కేసుకు సంబంధించి ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్పాట్ లో ఓ సూసైడ్ నోట్ కూడా ఉంది. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయనే ఉద్దేశంతో తనను తానే చంపుకున్నట్టు ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ నోట్ లో రాసి ఉంది. ఐతే… ఆమె కుటుంబసభ్యులు మాత్రం అది ఆత్మహత్య కాదు మర్డర్ అని పోలీసులకు కంప్లైంట్ చేశారు. సోషల్ మీడియాలో దీనిపై దుమారం రేగుతోంది. ఓ అమ్మాయిని అన్యాయంగా చంపేశారనీ ఆమెకు న్యాయం జరగాలని యువత కోరుతోంది. ఇందుకు సంబంధించిన అసలు వాస్తవం ఇదీ అంటూ ఫొటోలు, కథనాలు పోస్ట్ చేస్తున్నారు. కేసులో వాస్తవం ఏంటో దర్యాప్తులో తేల్చుతామని పోలీసులు అంటున్నారు.