జనసేనలో చేరనున్న నాగబాబు…ఎంపీగా పోటీ !

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ రాజకీయ చేరికలు ఊపందుకున్నాయి. తాజాగా పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు ఈరోజు జనసేనలో చేరుతున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం లోక్ సభ స్థానం నుంచి నాగబాబు పోటీచేస్తారని వెల్లడించింది. ఈ మేరకు జనసేన పార్టీ ట్విట్టర్ లో ఓ ప్రకటన చేసింది. నాగబాబు గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చురుగ్గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల జనసేనలో అధికారికంగా చేరకున్నా పవన్ కళ్యాన్ కు, జనసేనకు మద్దతుగా సోషల్ మీడియాలో తరచూ మాట్లాడుతున్నారు. ఇటీవల గుంటూరులో పార్టీ కార్యకర్తల సమావేశంలోనూ ఆయన పాల్గొన్నారు. ఎన్నికల వేళ ఆయన అధికారికంగా పార్టీలో చేరి పోటీ చేయనున్నారు. ఈ సీటు నుండి వైసీపీ తరపున పారిశ్రామిక వేత్త రఘురామ కృష్ణం రాజు పోటీ చేత్శున్నారు, టీడీపీ తరపున ఉండి ఎమ్మెల్యే శివ పోటీ చేస్తున్నారు, మరోపక్క కేయే పాల్ కూడా ఇక్కడి నుండే పోటీ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ సీట్ హాట్ సీట్ గా మారింది.