ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు

ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు
ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు

సోమవారం ఉదయం లక్నోలోని ఇటౌంజా పోలీస్ సర్కిల్ పరిధిలోని ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడడంతో తొమ్మిది మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు.

ప్రయాణీకులందరూ నవరాత్రుల మొదటి రోజు ప్రార్థనలు చేయడానికి బక్షి కా తలాబ్ ప్రాంతంలోని చంద్రికా దేవి ఆలయానికి వెళుతుండగా, ప్రమాదం జరిగింది.

సహాయక చర్యలు ప్రారంభించి తొమ్మిది మృతదేహాలను బయటకు తీయగా, డైవర్లు మరింత మంది కోసం వెతుకుతున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాక్టర్ ట్రాలీలో మొత్తం 46 మంది ఉండగా, ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. గాయపడిన 12 మందిని ఇటౌంజాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సిహెచ్‌సి)లో చేర్చారు.

ట్రాక్టర్ ట్రాలీలో ఉన్న ప్రయాణికులు చంద్రికా దేవిని దర్శించుకునేందుకు మోహన నుంచి వెళ్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది, చాలా మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.

పలువురు ప్రయాణికులు ట్రాలీ కింద కూరుకుపోయి ఉంటారని భావిస్తున్నారు.