ఎన్టీఆర్ హోస్టుగా చేసిన ‘బిగ్ బాస్’ షో రీ టెలికాస్ట్

ఎన్టీఆర్ హోస్టుగా చేసిన 'బిగ్ బాస్' షో .రీ టెలికాస్ట్

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా భారీ ప్రజల ఆదరణ పొంది ఉన్న బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్. సెలెబ్రిటీల జీవితంలోకి తొంగిచూడాలని , వాళ్ళ గురుంచి తెలుసుకోవాలి అనుకునే వారికీ ఇది ఒక మంచి వేదికనే చెప్పుకోవాలి.ఇక బిగ్ బాస్ షోలో జరిగే గొడవలు, మసాల రొమాన్స్ లు, పందాలు, యద్దాలు భలే మజా ఇస్తాయి. అందుకే అన్ని భాషలలో ఈ షో సూపర్ సక్సెస్ సాధించింది. ఇక తెలుగులో బిగ్ బాస్ షో 2017నుండి ప్రసారం అవుతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రసారమైన మొదటి సీజన్ సూపర్ సక్సెస్. ఇక 2018లో నాని, 2019లో నాగార్జున ఇలా ఇప్పటివరకు ఈ షోని విజయవంతంగా నడిపిస్తున్నారు.
ఇప్పుడు ఎన్టీఆర్ ని బుల్లి తెరపై మళ్లీ చూసే అవకాశం స్టార్ మా కల్పించింది. ఎన్టీఆర్ హోస్టుగా నడిచిన బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ ఎపిసోడ్స్ నేటి నుండి పునః ప్రసారం కానున్నాయి. ఈ విషయాన్నీ స్టార్ మా తెలియజేయడం జరిగింది. కరోనా కర్ఫ్యూ కారణంగా ఇంటికే పరిమితం అవుతున్న ప్రేక్షకులకు వినోదం పంచడానికి స్టార్ మా బిగ్ బాస్ ఎపిసోడ్స్ రీ టెలీకాస్ట్ చేస్తుంది. ఎన్టీఆర్ ని అప్పుడు బుల్లితెరపై హోస్ట్ గా మిస్సైన ఫ్యాన్స్ ఇప్పుడు ఆయన్ని చూసి ఆనందం పొందవచ్చు.