రెండో స్థానంలో పాక్ కెప్టెన్

రెండో స్థానంలో పాక్ కెప్టెన్

భారత మాజీకెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తర్వాత ఎక్కువ వన్డేలకి కెప్టెన్సీ వహించి పాకిస్థాన్ జట్టు కెప్టెన్ కీపర్ సర్ఫరాజ్అహ్మద్ అరుదైన ఘనత సాధించారు.కరాచీ వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌‌కి సర్ఫరాజ్అహ్మద్ కెప్టెన్సీ వహించారు.ఈ మ్యాచ్ తాను సారథిగా ఉన్న 50వన్డే అంతర్జాతీయక్రికెట్ మ్యాచ్. 50 వన్డేలకి కెప్టెన్సీ వహించిన ఘనత  భారతమాజీ క్రికెట్ కెప్టెన్ ధోనీ తర్వాత  కైవసం చేస్కున్నాడు.

ఈరోజు మూడోవన్డే ముందువరకూ 49వన్డేలకి సారథిగాఉండి,27మ్యాచ్‌ల్లో జట్టుని గెలిపించి మిగిలిన 22లో 20మ్యాచ్‌ల్లో పాక్ పరాజయం చూసింది.

200వన్డేలకి కెప్టెన్సీ వహించిన ధోనీ భారతక్రికెట్ టీమ్‌కి 110విజయాల్ని అందించి,90 మిగిలిన మ్యాచ్‌ల్లో 74పరాజయాలతో అత్యధిక అంతర్జాతీయక్రికెట్ మ్యాచ్ లకికెప్టెన్ గా భాద్యతలు వహించి మొదటిస్థానంలో ఉన్నారు.