Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో మరోసారి ‘అజ్ఞాతవాసి’ చిత్రంతో నిరూపితం అవ్వబోతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న అజ్ఞాతవాసి చిత్రం వచ్చే నెలలో సంక్రాంతి సందర్బంగా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న ‘అజ్ఞాతవాసి’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లుగా నిర్మాత మొదటి నుండి చెబుతున్నాడు. అయితే అమెరికాలో మునుపెన్నడు లేని విధంగా ‘అజ్ఞాతవాసి’ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాహుబలి, దంగల్ చిత్రాల కంటే కూడా అధికంగా అజ్ఞాతవాసి చిత్రం అమెరికాలో విడుదల కాబోతుంది.
అమెరికాలో తెలుగు వారి సంఖ్య చాలా పెద్దదే. ప్రతి రాష్ట్రంలో కూడా తెలుగు వారు కుప్పలు తెప్పలుగా ఉన్నారు. అందుకే ఎక్కువ స్క్రీన్లలో అజ్ఞాతవాసిని వేసేందుకు సిద్దం అవుతున్నారు. పవన్పై అమెరికన్ తెలుగు వారు భారీ ఎత్తున అభిమానం కనబర్చుతారు. అందుకే ఈ చిత్రాన్ని కేవలం అమెరికాలోనే ఏకంగా 209 స్క్రీన్లలో విడుదల చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి.
ఇప్పటి వరకు బాహుబలి 2 చిత్రం 126 స్క్రీన్లలో విడుదలై రికార్డుగా ఉంది. ఆ తర్వాత ఖైదీ నెం.150 చిత్రం 74 స్క్రీన్లు, కబాలి 73, దంగల్ చిత్రం 69 స్క్రీన్లలో సినిమాను విడదల చేశారు. కాని అవన్ని రికార్డులను బద్దలు కొడుతూ ఇప్పుడు పవన్ 209 స్క్రీన్లో రావడం చూసి అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. 5 మిలియన్ డాలర్ల టార్గెట్తో ఈ చిత్రం విడుదల కాబోతుంది. పవన్కు జోడీగా కీర్తి సురేష్, అను ఎమాన్యూల్లు హీరోయిన్స్గా నటించిన ఈ చిత్రంలో ఖుష్బు ముఖ్య పాత్రను పోషించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం హైదరాబాద్లోని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో చిత్రీకరణ జరుపుతున్నారు. సంక్రాంతి సందర్బంగా వచ్చే నె 10న చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.