కత్తి మహేష్ ను వెంబ‌డించిన ప‌వ‌న్ ఫ్యాన్స్

Pawan Kalyan fans follows to Kathi Mahesh car
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
కొన్నాళ్లుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పైనా, ఆయ‌న అభిమానుల పైనా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్న క‌త్తి మహేష్ నాలుగైదు రోజులుగా మౌనంగా ఉంటున్నాడు. అజ్ఞాత‌వాసిపై రివ్యూ మిన‌హా ఆయ‌న ఎలాంటి వ్యాఖ్య‌లూ చేయ‌లేదు. జ‌న‌వ‌రి 15 వ‌ర‌కూ  సైలెంట్ గా ఉండ‌మ‌న్న కోన వెంక‌ట్ స‌ల‌హా మేర‌కే తాను మౌనంగా ఉన్నాన‌ని క‌త్తి మ‌హేశ్ అంటున్నాడు. అదే స‌మ‌యంలో ట్విట్ట‌ర్ లో ప‌రోక్షంగా ఆయ‌న చేసిన ట్వీట్ పై చర్చ జ‌రుగుతోంది. ఖాళీ పాత్ర‌లే ఎక్కువ శ‌బ్దం చేస్తాయి. నిజాల కోసం జ‌న‌వ‌రి 16వ‌ర‌కు ఆగండి అని ట్వీట్ చేశాడు. అజ్ఞాత‌వాసిపై క‌త్తి రివ్యూ ఇచ్చిన త‌రువాత ప‌వ‌న్ ఫ్యాన్స్  చేసిన విమ‌ర్శ‌ల‌నుద్దేశించే క‌త్తి ఈ ట్వీట్ చేసిన‌ట్టు భావిస్తున్నారు.  మూడు రోజుల్లో ఏ చిత్రం భ‌విష్య‌త్ ఏంట‌న్న విష‌యాన్ని థియేట‌ర్లే చెబుతాయ‌న్న అర్ధం వ‌చ్చేలా క‌త్తి ట్వీట్ ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు.
అటు సంక్రాంతి పండుగ కోసం సొంతూరుకు వెళ్లిన క‌త్తి మహేష్ ను దారి మ‌ధ్య‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ వెంబ‌డించారు. క‌త్తి ట్విట్ట‌ర్ లో ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు. నేను ఇప్పుడే మా గ్రామానికి చేరుకున్న… దారిమ‌ధ్య‌లో పీలేరు స‌మీపంలో ఇద్ద‌రు బైక‌ర్లు న‌న్ను గుర్తుప‌ట్టి, కారును వెంబ‌డించ‌డంతో పాటు జై ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని నినాదాలు చేశారు. నేను ఇంటికి వ‌చ్చాక నాకు అర్ధ‌మైంది ఏంటంటే, ఇటీవ‌ల నాకోసం విజ‌య‌వాడ‌, తిరుప‌తి, మ‌ద‌న‌ప‌ల్లి, పుత్తూరు ప్రాంతాల నుంచి మా గ్రామానికి ప‌వ‌న్ అభిమానులు వ‌చ్చి నాకోసం వెతికారు అని క‌త్తి ట్వీట్ చేశాడు.