నేను నోరు తెరిస్తే వాళ్ళ పరువు మురికి కాల్వలోకి …రేణు దేశాయ్.

Renu Desai Warning To Pawan Kalyan Fans

సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటి ప్రవర్తిస్తే గదిలో పెట్టిన పిల్లి అయినా పులిలా ఎదురు తిరుగుతుంది. ఇప్పుడు అదే జరిగింది. తాను రెండో పెళ్ళికి సిద్ధం అయిన తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్ చూసి తట్టుకోలేక రేణు దేశాయ్ ట్విట్టర్ కి గుడ్ బై కొట్టారు. ఆ పని చేసే ముందు పవన్ ఫ్యాన్స్ నెగటివిటీ తట్టుకోలేక ఈ పని చేస్తున్నట్టు కుండబద్ధలు కొట్టి మరీ చెప్పారు. అయినా కొందరి తీరు మారలేదు. ఆమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ లోకి వచ్చి మరీ ప్రతికూల కామెంట్స్ పెడుతున్నారు. రేణు ఇంకో పెళ్లి చేసుకోడాన్ని తప్పుపడుతున్నారు. దీంతో ఆమె సహనం నశించింది. ఈ విషయంలో ఇక తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్న ఆమె పవన్ ఫ్యాన్స్ కి ఓ హెచ్చరిక చేసింది.

“మీరు నా వ్యక్తిగత జీవితంలోకి చొరబడి ఇబ్బంది పెట్టే కామెంట్స్ పెడితే చూస్తూ ఊరుకోను. నేను గనుక పవన్ తో నా విడాకులకు సంబంధించి అన్ని విషయాలు బయటపెడితే మీ పొగరు అణిగిపోతుంది. ఆ పొగరు మురికి కాల్వలో పడి కొట్టుకుపోతుంది “అని రేణు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేసింది. అసలు పవన్ ఫ్యాన్స్ నెగటివిటీ ని తాను ఎందుకు భరించాలని రేణు ప్రశ్నించింది. ఇకనైనా పవన్ ఫ్యాన్స్ నాకు చచ్చు సలహాలు ఇవ్వడం మానేయాలని ఆమె తేల్చి చెప్పింది. తన అభిప్రాయాలు చెప్పుకోవడం కూడా అపరిపక్వత ఎలా అవుతుందని రేణు పవన్ ఫ్యాన్స్ ని నిలదీసింది.

తాజాగా రేణు చేసిన హెచ్చరికలు పవన్ ఫ్యాన్స్ లో కూడా కొంత భయాన్ని రేకెత్తిస్తున్నాయి. తాము ట్రోలింగ్ ఆపకపోతే రేణు బయటపెట్టే విషయాలు తాము దేవుడిలా కొలిచే పవన్ వ్యక్తిత్వాన్ని దెబ్బ కొడతాయేమో అని వారిలో కొద్దిపాటి వణుకు మొదలైంది. ఇన్నాళ్లు మౌనంగా వున్న రేణు ఇక నోరు ఎత్తి అన్ని విషయాలు చెప్పే పరిస్థితి వస్తే వాటి అన్నిటికీ పవన్ వైపు నుంచి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. పైగా వ్యక్తిగత అంశాలు బయటకు వస్తే అకీరా , ఆద్య ఇబ్బంది పడతారని రేణు సంయమనం పాటించారు. తాజా హెచ్చరికతో అయినా పవన్ ఫ్యాన్స్ ధోరణి మారుతుందని ఆమె భావిస్తున్నారు.