మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న బుట్టబొమ్మ

మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న బుట్టబొమ్మ

‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డే అరుదైన రికార్డు సాధించింది. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ ఉంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌ చిట్‌చాట్‌ నిర్వహిస్తు నిత్యం ఫ్యాన్స్‌ను పలకరించే ఈ బుట్టబొమ్మ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 15 మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. దీంతో పూజా సోషల్‌ మీడియా వేదికగా సంబరాలు చేసుకుంటోంది. తన హేర్‌ స్టైలిస్ట్‌, మేకప్‌ అర్టిస్ట్‌ కాజోల్‌, కుక్‌, అసిస్టెంట్‌, కుక్‌ అసిస్టెంట్స్‌లను కూడా తన సంతోషంలో భాగం చేస్తూ ఓ వీడియో షేర్‌ చేసింది.

దీనికి ‘ఇన్‌స్టాలో 15 మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నా క్రేజీ టీంను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. వీరంతా నన్ను నవ్విస్తారు, జాగ్రత్తగా చూసుకుంటారు. నేను అనారోగ్యం బారిన పడకుంటా చూసుకుంటుంటారు. అలాగే నేను అందంగా కనిపించేలా చేస్తారు’ అంటూ రాసుకొచ్చింది. అంతేగాక తను ఈ మైలు రాయి చేరుకోవడంలో సహాయం చేసిన ఫ్యాన్స్‌, ఫాలోవర్స్‌కు పూజా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపింది.

కాగా ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఇక్కడ సూపర్ హిట్‏గా నిలిచింది. ఈ క్రమంలో ఆమె టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. తాజాగా ఆమె నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా విడుదలకు సిద్ధంగా కాగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ‘రాధేశ్యామ్’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటు తమిళంలో స్టార్ హిర్ విజయ్ సరసన నటిస్తోంది. ఇలా చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న ఈ బుట్టబొమ్మ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరడం నిజంగా విశేషమే.