సైరాలో ఈమె కూడానా?

Pragya Jaiswal about Chiranjeevi Sye Raa Narasimha Reddy,

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రీకరణ శరవేగంగా జరుపుతున్న విషయం తెల్సిందే. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో పలువురు స్టార్స్‌ నటిస్తున్నారు. చిన్న పెద్దా అనే తేడా లేకుండా పలు పాత్రలకు స్టార్స్‌ను ఎంపిక చేయడం జరిగింది. అమితాబచ్చన్‌తో పాటు విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, నయతార, తమన్నా, సునీల్‌లు నటిస్తున్నారు. ఇదే సినిమాలో మరో హీరోయిన్‌ కూడా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

‘కంచె’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి అందరి దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌ ఈ చిత్రంలో నటించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ‘సైరా’ ప్రారంభం అయినప్పటి నుండి కూడా ప్రగ్యాను ఒక ముఖ్యమైన పాత్రకు ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరిగింది. తాజాగా ‘ఆచారి అమెరికా యాత్ర’ విడుదల సందర్బంగా మీడియాతో మాట్లాడిన ప్రగ్యా జైస్వాల్‌ ‘సైరా’ చిత్రంలో తాను నటించనున్నట్లుగా వస్తున్న వార్తలపై స్పందించింది. తనను సైరా యూనిట్‌ సభ్యులు సంప్రదించిన మాట వాస్తవమే అని, కాకుంటే మరోసారి వారు నాతో చర్చలు జరపలేదని చెప్పుకొచ్చింది. ప్రగ్యాను ఎంపిక చేయాలని భావించిన పాత్ర కోసం తమన్నాను తీసుకున్నారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు మాత్రం తమన్నాతో పాటు ప్రగ్యా కూడా ఈ చిత్రంలో కనిపించబోతుందని చెబుతున్నారు. ఒక వేళ ప్రగ్యాకూడా ఈ చిత్రంలో నటిస్తే సినిమా మరింత కలర్‌ ఫుల్‌గా కనిపించడం ఖాయం.