‘2.0’ చిత్ర నిర్మాత ఆ కంపెనీపై దావా వేశాడట

rajinikanth 2.0 movie producer to Sue this vfx company

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రజినీకాంత్‌, శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘2.0’. ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయాలని భావించారు. అయితే విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఆలస్యం కారణంగా సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. ఏప్రిల్‌లో సినిమా విడుదల అవ్వబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఇక ఈ చిత్రం విడుదల కారణంగా నిర్మాణ సంస్థకు భారీ నష్టం వాటిల్లుతుందని, ఆ నష్టంను విజువల్‌ ఎఫెక్ట్స్‌ సంస్థ భరించాల్సిందిగా డిమాండ్‌ చేస్తూ లైకా ప్రొడక్షన్స్‌ వారు దావా వేయడం జరిగింది. అన్ని అనుకున్నట్లుగా జరిగి, విజువల్‌ ఎఫెక్ట్స్‌ సంస్థ సరిగా వర్క్‌ చేసి ఉంటే సినిమా ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉందని, కాని ఆ సంస్థ అలసత్వం కారణంగా సినిమా ఆలస్యం అవుతుందని అంటున్నారు.

జనవరిలో సినిమాను విడుదల చేయాలని భావించిన తమకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ సంస్థ అనుకున్న సమయానికి ఔట్‌ పుట్‌ ఇవ్వలేక పోతుంది. దాంతో ఏప్రిల్‌కు సినిమాను వాయిదా వేశాం. అప్పటికి అయినా సినిమాను ఆ సంస్థ వారు పూర్తి చేస్తారా అనే అనుమానాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఆ కంపెనీపై దావా వేసినట్లుగా నిర్మాత అంటున్నాడు. అమెరికాకు చెందిన ఆ సంస్థ గతంలో పలు అవార్డులు, రివార్డులు అందుకుంది. కాని ఈ ప్రాజెక్ట్‌ విషయంలో మాత్రం అలసత్వం కనబర్చుతుంది. ఆ సంస్థ ఇప్పటికి అయినా వర్క్‌ను స్పీడ్‌ చేసి, వచ్చే ఏప్రిల్‌లో విడుదల అయ్యేలా చేస్తుందా అనేది చూడాలి. ప్రస్తుతం దర్శకుడు శంకర్‌ కూడా సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కాకపోవడంతో చిరాకు పడుతున్నాడు.